ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ ఓదార్పు యాత్ర అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ బొత్స ఝాన్సీ లక్ష్మి దృష్టికి అన్ని నిరుద్యోగ సమస్యలను వినతి పత్రం రూపంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర యూనివర్సిటీలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అన్ని హాస్టల్ డైలీ వేజ్ గా ఉన్న సిబ్బందిని 28 డేస్ గా పదోన్నతి కల్పించి, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీను తక్షణమే అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. వెంటనే ఆమె స్పందించి నిరుద్యోగుల సమస్యలను తప్పక నెరవేరుస్తామని భరోసా కల్పించారని అన్నారు. ఎన్నికల కోడ్ లోపు మరొక లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ ఇచ్చి ఆదుకోవాలని హేమంత్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ఆల్ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ అధ్యక్షులు అచ్చిబాబు, ప్రెసిడెంట్ కాశీ, సెక్రటరీ ఎల్లపు శ్రీను నిరుద్యోగ యువత, పాల్గొన్నారు.