కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పాక్ హిందువుల నిరసన తెలిపారు. పాకిస్థానీ వలసదారులు భారతీయుల ఉద్యోగాలు, ఇళ్లను లాక్కుంటారని చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్కు చెందిన హిందూ శరణార్థులు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట భారీ నిరసన చేపట్టారు. దాదాపు 100-150 మంది ఆందోళనకారులను ఢిల్లీ పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు.పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలు కూడా నిరసనల్లో భాగయ్యారు.
కేజ్రీవాల్ శరమ్ కరో, సి.ఎ.ఎ. కానూన్ పర్ భ్రమ్హక్ బయాన్, కేజ్రీవాల్ మాఫీ మాంగో ప్లకార్డులను పట్టుకుని నిరసనకారులు ఢిల్లీ ముఖ్యమంత్రి ఇటీవల కేంద్రం నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం సి.ఎ.ఎ. పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మేం పాకిస్థాన్ నుంచి అన్నీ విడిచిపెట్టి భారత్కు ఆశ్రయం కోసం వచ్చాం.. మోదీ ప్రభుత్వానికి మాపై శ్రద్ధ ఉంటే కేజ్రీవాల్ కి ఇంత అసూయ ఎందుకు అని పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఓ సిక్కు ఆగ్రహం వ్యక్తం చేశారు.