కరప మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెనుగుదురు గ్రామం జనసేన నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ. తుమ్మలపల్లి మాచర్రావు, మాజీ సర్పంచ్, టీ.డీ.పీ. సీనియర్ నాయకులు రెడ్డి పల్లి నారాయణ రావు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన-టీ.డీ.పీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చాసారు.
ఆయన్ని కరప మండల వాసులు సాదరంగా ఆహ్వానించారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి కార్యలయాన్ని ప్రావంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. ఉమ్మడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షులు బండారు మురళి, గ్రామ అధ్యక్షులు గంట నానీబాబు, టీడీపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.