తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో టాటా బ్రాండ్ తనేరియా ఆధ్వర్యంలో శారీ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమని నారా బ్రాహ్మిణి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆమె రన్ జండాను ఊపి రేస్ ను ప్రారంభించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. తనేరియాా బ్రాండ్ ద్వారా మంగళగిరి చేనేతల చీరలను అమ్మేందుకు ఇటీవల ఒప్పందం కూడా చేయించారని అన్నారు.