ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఉన్న ధనట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్దారి జోట్ గ్రామంలో కొందరు వ్యక్తులు పొలాల్లో పని చేస్తున్న స్త్రీ, పురుషులపై దాడి చేసి కర్రలతో కొడుతూ బీభత్సాన్ని సృష్టించారు. అక్కడ పనిచేస్తున్న ఒక మహిళ పై కర్రలతో దాడి చేసి ధారుణంగా కొట్టారు. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిగిన ఘటన పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న తనకు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
యూపీలో మహిళపై దారుణం…
![WhatsApp Image 2024-03-20 at 3.28.40 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-20-at-3.28.40-PM.jpeg?resize=479%2C502&ssl=1)