మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) ఇప్పుడు హాస్పిటల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) విద్యార్థులు మరియు సిబ్బందికి CGHS ధరలకు నగదు రహిత చికిత్సను అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులోభాగంగా రెండు సంస్థల BMHRC డైరెక్టర్-ఇన్చార్జ్ డాక్టర్ మనీషా శ్రీవాస్తవ మరియు IISER డైరెక్టర్ ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ దానికి సంబందించిన ఎం.ఓ.యూ. పై సంతకాలు చేశినట్లు తెలిపారు.
ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై రెండు సంస్థలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ మనీషా శ్రీవాస్తవ తెలిపారు. ఇదే అంశంపై IISERతో చర్చించింనట్లు ఆయన తెలిపారు. రాబోయే కాలంలో,మేము IISERతో ఆరోగ్య సంబంధిత అంశాలపై పరిశోధన చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నామని వెళ్లడించారు.