![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/Accused-persons-of-Samalkot.jpg?resize=640%2C480&ssl=1)
ఆంధ్రప్రదేశ్లో మున్సిఫల్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. తడిపితేనేగాని పనులు జరగని దాఖలాలు అనేకం.
ప్రత్యేక సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ ఈ తంతు షరామామూలే అంటున్నారు బాదితులు. గతంలో అనేక విడతలుగా ఏసీబీ అధికారులు సామర్లకోట మున్సిఫల్ కార్యాలయంపై దాడులు చేసి నిందిత ఉద్యోగులను సస్పెండ్ చేసినప్పటికీ ఇక్కడ అవినీతి మామూలైపోయింది.
తాజాగా రూ.8,000 లంచం తీసుకుంటుండగా సామర్లకోట తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న ఉప్పు దుర్గ బాలాజీ రమణమూర్తిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన అవసరాల రామలక్ష్మి తన భర్త ఏవివి ఎస్ ఎస్ కుమార్ మృతి చెందగా ఆయనకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, రామలక్ష్మి కి చెందిన జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఇటీవల తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది. ఆర్ఐ రమణమూర్తి రూ.10,000 డిమాండ్ చేశారు. రూ.8,000కు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను సంప్రదించింది.