సమర్థవంతంగా విధులు నిర్వర్తించి కాకినాడ నగరపాలక సంస్థ కీర్తి ప్రతిష్టలు పెంపొంది స్తానని కెఎంసి గ్రేడ్ వన్ కమిషనర్ ఎం ఏసుబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగర పాలక సంస్థ సెక్రటరీ గా పనిచేస్తున్న ఏసుబాబు ఇటీవల ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కె ఎం సి స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు ద్వారా గ్రేడ్ వన్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతంగా సేవలు అందించి కాకినాడ నగర పాలక సంస్థ ప్రగతి పథంలో నడిపించిందేకు తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.