ఆంధ్ర ప్రదేశ్ ఆర్.టీ.ఐ. జే.ఏ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అదనపు ఎస్.పీ. ని కలిసి ఏర్.టీ.ఐ. దరఖాస్తుదారుడు పై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు ఇచ్చారు. గత నెల 06/02/2024 న అమలాపురం ఏం.పీ.డీ.ఓ. కార్యాలయానికి మొదటి అప్పీలుకు హాజరవ్వాల్సిందిగా లేఖ ద్వారా దరఖాస్తు దారుడు ఎస్. రాంబాబు అనే ఏలూరు నివాశికి తెలియజేశారు.అయితే దీనికి హాజరైన అతనిపై ప్రణాళిక ప్రకారం అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ లు, సర్పంచ్ ల భర్తలు కలిసి విచక్షణా రహితంగా దుర్భాషలాడుతూ ధాడి చేసి కర్ణభేరి లు దెబ్బతినేలా తీవ్రంగా గాయపరచారన్నారు.
దీనికి ప్రధాన బాధ్యులు అమలాపురం ఎం.పీ.డీ.ఓ., అమలాపురం ఈ.ఓ.పీ.ఆర్. & ఆర్.డీ., పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రుద్రరాజు, సూరపు రాజు, వీరితో పాటుగా సర్పంచ్ లు మరియు సర్పంచ్ ల భర్తలు దాడిచేసారన్నారు. వీరిపై పూర్తి విచారణ చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ఆర్.టీ.ఐ. జే.ఏ.సీ. అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, ఉపాధ్యక్షురాలు కామిరెడ్డి లలితాదేవి డిమాండ్ చేశారు.