38కి చేరుకున్న అస్సాం వరద మృతులు…
అస్సాంలో గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా, అస్సాంలో వరదల కారణంగా ఇప్పటివరకు 38 మంది మరణించారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వరద నివేదిక ప్రకారం… జూలై 2న, టిన్సుకియా జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ధేమాజీ జిల్లాలో ఒకరు మరణించారు దానితో మొత్తం మరణాల సంఖ్య 38కి చేరుకుంది. అసోంలో వరద పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 28 జిల్లాల్లో 11.34 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.