తీరం దాటిన మిచౌంగ్…
తీవ్రతుఫాను మిచౌంగ్ తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం మధ్యాహనం 12:30 నుంచి 2:30 గంటల మధ్యలో బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు తెలిపింది. తీరం వెంబడి గాలి వేగం గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది. మిచౌంగ్ తీరం దాటినప్పటికి ముప్పుకు గురయ్యే ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపింది.