WhatsApp Image 2024-03-08 at 8.35.39 AM Political

తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర…

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో జనసేన పార్టీ పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారని తెలిపారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

R Crime

నల్లపాడు సి.ఐ. పై సస్పెన్షన్ వేటు…

గుంటూరు జిల్లాలో నల్లపాడు స్టేషన్ లోని సీ.ఐ. రాంబాబు పై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు మండలం వెంగలాయ పాలెం గ్రామంలోని ఓ స్థలం వివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై అధికారుల నివేదిక మేరకు ఐ.జి. పాల రాజు సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ విషయంపై పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ […]

306fd74e-6ae3-4ba7-b7d6-8977e22b9dbb Exclusive

సీఎం చేతుల మీదుగా ఆడుదాం ఆంధ్రా ప్రారంభం…

గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడలు నల్లపాడు లయోలాలో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు ఈ పోటీలను ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 5.09 లక్షల ఆడుదాం ఆంధ్రా స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ చేసారు. ఈ పోటీలు 47 రోజులు 5 దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రీడలకు 1.22 కోట్ల […]