పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి…
ఆస్తి పన్ను, నీటిమీటర్లు, యూజర్ చార్జీల పై సమీక్ష.. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో యూజర్ చార్జీలు, ఆస్తి పన్నులు, నీటి మీటర్ల బకాయిల పై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఆర్వోలు, డిఈలు, ఏఈలు, సచివాలయ అడ్మిన్లు, ఎమినిటీ కార్యదర్శులు, శానిటరీ సూపర్వైజర్లు,ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ […]