తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి… -ఐ.ఎం.డీ.-
హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో రుతుపవనాలు మరింత పురోగమించాయని, రానున్న ఐదు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐ.ఎం.డీ. తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అత్యధికంగా రంగారెడ్డిలో 74.5 మి.మీ, ఖమ్మంలో 68.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, రాణిగంజ్, బేగంపేట, మారేడ్పల్లి, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్తో సహా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో […]