పెద్దాపురంలో అధ్వానంగా మారిన రహదారులు…
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణంలోని పలు కాలనీలలో రహదారుల పరిస్థితి దయానీయంగా మారింది. గ్రావెల్ రోడ్లు గుంతలు పడటంతో ఇటీవలి వర్షాలకు నీరుచేరి ప్రమాదభరితంగా మారాయి. పట్టణంలో సుధా కాలనీ, టీచర్స్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, బ్యాంక్ కాలనీలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారడంతో అటు వైపు వెళ్లే ప్రజలు అనేక భాదలు పడుతున్నారు. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.