WhatsApp Image 2024-05-12 at 6.26.06 AM Exclusive

పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్న మెగా హీరో…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపేందుకు శనివారం పిఠాపురం వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీ పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. తల్లి సురేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలసి శక్తి పీఠం పురూహుతికా అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు చక్ర దర్శనం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆయన రాక తెలుసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం […]

3292934e-d11f-4698-9f13-15a819862b9f Exclusive

పిఠాపురానికి నేడు జగన్.. రామ్చరణ్ ల రాక…

ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. పిఠాపురంలో క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీ.ఎం. జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. పూజల అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

7055a336-cb75-4246-9210-122933df9111 Political

పిఠాపురంలో బహిరంగ సభలో జనసేన అధినేత…

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాన్ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనమంతటితో తలక్రిందులైపోతుందా..? అన్న చందంగా 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎం.పీ. లను చేతిలో పెట్టుకొని వై.సీ.పీ. ప్రజలను భయపెట్టింది అని అన్నారు. కడుపు మండిన భవన […]

fef215c4-3e07-48c2-a7bc-f5f25f562738 Exclusive

పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో…

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాన్ కోరారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని ఆయన స్పష్టం చేశారు. నా కష్టం, నా శ్రమ.. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. జనసేన, బీ.జే.పీ., టీ.డీ.పీ. కూటమి […]

n Kakinada

పిఠాపురంలో జనసేనలో చేరిన 200 కుటుంబాలు…

పిఠాపురంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి నుంచి వై.సీ.పీ. పార్టీ కి చెందిన నాయకులు గొండవరపు నూకరాజు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుంపట్ల సత్యనారాయణ, అమరాది వల్లి, వీరబాబు, రాధాకృష్ణ, అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

OIP (15) Political

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చరిష్మా vs వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. గీత క్రెడెన్షియల్స్…

గణనీయమైన కాపు సామాజికవర్గ ఓటర్లు, అధికార వ్యతిరేకతతో పాటు ఆయన వ్యక్తిగత చరిష్మాతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చూడాలని ఆశిస్తున్నారు. అతని ప్రత్యర్థి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీత, నటుడు-రాజకీయనాయకుడిని ఓడించడానికి ఆమె ట్రాక్ రికార్డ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎన్డీయే సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా జనసేనకు పిఠాపురం సెగ్మెంట్ కేటాయించగా, ఆ ప్రాంతంలోని ఆధిపత్య కాపు సామాజికవర్గానికి చెందిన కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో వెలుగులోకి […]

OIP (9) Political

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్…

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్ ఇచ్చింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా తెలుగు దేశం పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తీసేలా మాదేపల్లి శ్రీనివాసు ప్రవర్తించారు. దీని కారణంగా, అదే విధంగా జనసేన నాయకత్వంతో, పార్టీ శ్రేణులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న కారణంగా ఆయనను జనసేన పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. వచ్చిన ఆరోపణలకు రానున్న రెండు వారాల్లో లిఖిత పూర్వకంగా సంజాయిషీకి […]

WhatsApp Image 2024-05-06 at 8.58.33 AM Political

పిఠాపురం ప్రజలను కుటుంబ సభ్యులుగా వ్యక్తి పవన్ కళ్యాన్…

రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేసి, ఎవరు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున భరోసాగా అందజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. […]

WhatsApp Image 2024-05-04 at 8.58.11 PM Exclusive

పిఠాపురం పుర వీధుల్లో మారు మ్రోగుతున్న జనసేన నినాదాలు…

జనసేన పార్టీ అధ్యక్షులు వన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గత నెల రోజులుగా పిఠాపురంలోనే ఉంటూ ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం పుర వీధుల్లో ఏ మూలన చూసినా జై జనసేన.. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు.. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి.. అనే నినాదాలు మారు మ్రోగుతున్నాయి. ముఖ్యంగా మెగా కుటుంబం పిఠాపురం ఎన్నికలపై […]

3239055 Political

పార్టీ విజయంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి… -జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని ప్రజలే సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గెలుపు ప్రతిఫలం వారికే దక్కుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ధీమా వ్యక్తం చేసారు. కార్యకర్తలు ఆయన విజయంలో భాగస్వాములు కావాలని అన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసేన నాయకులు బలిరెడ్డి నానీ, గారపాటి గణేష్, గొంతిరెడ్డి గంగా నేతృత్వంలో నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరిన వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలింగ్ తేదీ […]