ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో జిల్లా రెవెన్యూ అధికారి భేటీ…
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు రాజకీయ నాయకుల ప్రచారాలకు ఉపయోగించే కరపత్రాలు, గోడ పత్రికలను ముద్రించాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. తిప్పే నాయక్ అన్నారు. 2024 లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి షేడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లో డీఆర్వో తిప్పే నాయక్ జిల్లా పౌర సంబంధాల అధికారి డీ. నాగార్జనతో కలిసి జిల్లాలోని వివిధ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. […]