OIP (1) Viral

ఆ పోటీల్లో విజేతలకు బహుమతులందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్…

ఇటీవల రాజమండ్రి పట్టణ డివిజన్ లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యుత్ పొదుపుపై విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖన,తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థుల్లో విజేతలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ డివిజన్ వై. విజయానంద్ బహుమతుల ప్రదానం చేశారు.

WhatsApp Image 2023-11-27 at 8.31.24 PM Exclusive

జగనన్న పాల వెల్లువ ప్రగతిపై సమీక్ష… -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత-

జేపివి పాల సేకరణ లక్ష్యాలు 10 వేల లీటర్లు పెంచాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. కలెక్టరేట్ లో జగనన్న పాల వెల్లువ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ… జిల్లాలోని 4 మండలాలు పరిధిలో ఉన్న 35 గ్రామాల పరిధిలో 5400 లీటర్ల పాల సేకరణ చెయ్యడం జరుగుతోందని అన్నారు. ఆ లక్ష్యాలను 10 వేల లీటర్ల కు చేరాలని పేర్కొన్నారు. ప్రతీ గ్రామం లో 160 మంది […]

images (13) Andhra Pradesh

రాజమండ్రి బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం…

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు ఈ బ్రిడ్జిపై ఇటీవల మరమ్మత్తు పనులు నిర్వహించిన నేపథ్యంలో పలు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుండి వాహనాల రాకపోకలను ఈ బ్రిడ్జిపై నుండి అధికారులు ప్రారంభించారు. సాధారణ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఈ రాకపోకలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.