బీ.జే.పీ. నేతలు నకిలీ హిందువులు… -తెలంగాణ సీ.ఎం. రేవంత్-
రాజకీయ లబ్ధి కోసం రాముడి పేరును బీ.జే.పీ. వాడుకుంటోందని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాషాయ పార్టీ సభ్యులను, నాయకులను నకిలీ హిందువులని అన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్లో జరిగిన రోడ్షోల్లో సీ.ఎం. పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బీజేపీ దృష్టిలో దేవుడు ఓట్ల కోసం, రాముడు సీట్ల కోసం నిలుస్తాడని విమర్శించారు. కానీ మనకు రాముడు రాముడేనని అన్నారు. అయోధ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు […]