సీ.ఎం. క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు…
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన ఛలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీ.ఎం. కార్యాలయం వైపు నిరసన చేస్తూ వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.