అనపర్తి నియోజకర్గంలో జీ.బీ.ఆర్. కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి సంబరాలను ప్రారంభించారు. తొలత భోగెకు సిద్దంచేసిన కట్టెలను వెలిగించారు కార్యక్రమాన్ని ప్రారంభిచారు. తరువాత చిన్నారులకు భోగి పళ్ళు వేసి వారిని ఆశీర్వదించారు. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన కోడిపందాల పోటీలు ప్రజలను ఆకాట్టుకున్నాయి. విద్యార్ధి, విద్యార్ధినులకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి ఎం.ఎల్.ఏ. చేతుల మీదుగా బహుమతులను అందచేశారు.