అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వన దుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా చండీ హోమం చేపట్టారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ వనదుర్గ అమ్మవారిని వివిధ రకముల పుష్పములతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వ్రత పురోహితులు అమ్మవారికి శ్రీ సూక్తం, పురుష సూక్తం, మూల మంత్రముల నవగ్రహ అర్చన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. హోమం నిర్వహించిన భక్తులకు, వేద పండితులు వేద ఆశీర్వచనం గావించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు , ఆలయ అర్చకులు , వ్రత పురోహితులు, ఐ వి రామారావు, దేవస్థానం అధికారులు, భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.