రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది.. వారి బంధువులు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేయగా brain డెడ్ ఆయినట్లు డాక్టర్ల నిర్థారించారు. తదనంతరం ఆమెను ట్రస్ట్ హాస్పిటల్ తరలించారు.
కుటుంబ సభులు అనుమతితో వారి కుమారులు రాజారపు మహేష్, రాజారపు కృష్ణ, రాజారపు నారాయణ మూర్తి, భర్త రాజారపు చిట్టిబాబు అలియాస్ రాజారపు శేషగిరి రావు గారి అనుమతితో అవయవదానంకు ముందుకు వచ్చారు.
సేఫ్ హాస్పిటల్ అధినేత డాక్టర్. ఆనంద్ గారి ప్రోత్సాహంతో ఈ అవయవదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ట్రస్ట్ యాజమాన్యానికి కుటుంభం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె రెండు కిడ్నీలు దానం చేయగా ఒక కిడ్నీ ట్రస్ట్ హాస్పటల్ కు మరియు రెండవ కిడ్నీ వైజాగ్ కు తరలించారు. కళ్ళను స్థానిక బాదం బాలకృష్ణ ‘ఐ’బ్యాంకు కు దానం చేశారు.