ఇళ్లల్లో మనుషులు లేని సమయంలో చోరీలు చేస్తున్న దొంగల ముఠాను పోలీపులు ఆరేస్ట్ చేసారు. ఆ దొంగలనుంచి 220 గ్రాముల బంగారం వస్తువులు, 718 గ్రాముల వెండి వస్తువులు వగైరా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్.పీ. శ్రీ ఎస్. శ్రీధర్ గారి దిశానిర్దేశాల ప్రకారం అడిషనల్ SP (Admin) శ్రీ. Sk. ఖాదర్ బాషా గారి పర్యవేక్షణలో దర్యాప్తును వేగవంతం చేసి కేసులలో జరుగుతున్న సరళిని బట్టి పాత, కొత్త నేరస్తుల కదలికలు వంటి వాటిపై నిఘా తీవ్రతను చేయడం సాంకేతికంగా ప్రయత్నాలు చేయడంతో గత కొంతకాలంగా నేరాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నటువంటి ముగ్గురు నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు.
వారు ఇటీవల ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో గల ఇండ్లలో చోరీలు చేసారని తెలిపారు. మొత్తం 10 కేసులలో వారి వద్ద నుండి 220.74 గ్రాములు బంగారం వస్తువులు, 718.71 గ్రాములు వెండి వస్తువులు, ఒక T.V., ఒక గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసీనట్లు పోలీసులు తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారుగా 12.5 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు.