జూన్ 28 నుండి 30 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాయువ్య భారతదేశంలో వర్షపాతం కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. రుతుపవనాల ఉత్తర పరిమితి ముంద్రా, మెహసానా, ఉదయపూర్, శివపురి, సిద్ధి, లలిత్పూర్, చైబాసా, హల్దియా, పాకూర్, సాహిబ్గంజ్, రక్సాల్ గుండా కొనసాగుతుంది. ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ రాష్ట్రం, మధ్యప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
రాజస్థాన్లోని మరికొన్ని భాగాలు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు బీహార్లోని మిగిలిన భాగాలు తూర్పు ఉత్తర ప్రదేశ్లోని చాలా ప్రాంతాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని భాగాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్-లడఖ్-గిల్గిత్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్లోని ఉత్తర ప్రాంతాలు మరియు హర్యానాలోని ఉత్తర ప్రాంతాలలో వచ్చే 3-4 రోజుల్లో వర్షాలు రానున్నట్లు ఐ.ఎం.డీ. తెలిపింది. రుతుపవనాలు దాని సాధారణ పథంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు ఒక వారం ఆలస్యం అవుతున్నాయి. జూన్ 11 తర్వాత దాదాపు 9 రోజుల పాటు నెమ్మదించింది.