సామర్లకోట పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల డి.ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్లో రెండవ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథిగా విచ్చేశి ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఆత్మరక్షణకు కరాటే క్రీడ ఎంతో దోహదపడుతుందని లైన్స్ క్లబ్ జిల్లా మొదటి వైస్ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, కరాటే ఇండియా చీఫ్, ఆంధ్ర, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆర్. మల్లికార్జున గౌడ్ లు అన్నారు.
అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ… విద్యార్థులకు విద్యతో పాటు వ్యాయామం, ఆత్మ రక్షణ క్రీడల్లో ప్రవేశం ఎంతైనా అవసరం ఉందన్నారు. కరటే క్రీడలో సంపాదించుకున్న సర్టిఫికెట్ల ద్వారా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును పొందగలరన్నారు. తొమ్మిది రాష్ట్రాల నుండి సుమారు 800 మంది విద్యార్థులైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా వారి అత్యంత ప్రతిభను కనబరిచి పథకాలు సాధించారు.
ఉన్నత భవిష్యత్తుకు క్రీడలు దోహదపడతాయి…
![WhatsApp Image 2023-12-10 at 8.23.23 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-10-at-8.23.23-PM.jpeg?resize=1280%2C576&ssl=1)