అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకపోడంపై సర్వత్రా సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమై వారి వారి ఆవేదనను వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయితాబత్తుల ఆనందరావుకి సీటీ ఇవ్వాల్సిందిగా వారు సూచించారు.