![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/Snapshot-4.png?resize=640%2C394&ssl=1)
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్
దేశ జనాభాను పెంచేందుకు పూర్వీకుల పద్దతులకు రష్యా…
శత్రువుల నుంచి కాపాడుకోవాలంటే జన భలం కావాలి. ఒకప్పుడు ఎక్కువ మంది సంతానం ఉంటే ఆ కుటుంభానికి అంత భలం ఉండేది. అదే సూత్రాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అనుసరిస్తున్నారు. రష్యా దేశ మహిళలకు ఆయన ప్రత్యేక విజ్జప్తి చేశారు. ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కని, పెద్ద కుటుంభాలుగా విస్తరించాలని ఆయన సూచించారు. ఇటీవల మాస్కోలో జరిగిన ‘వరల్డ్ రష్యన్ పీపుల్స్’ కౌన్సిల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. 1990 నుంచి జననాల సంఖ్య తగ్గిందని వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి భారీగా ప్రాణనష్టం వాటిల్లిందన్నారు. భవిష్యత్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ దేశ ప్రజలకు ఆయన సూచించారు. పాతతరంవారు కుటుంభానికి నలుగురు, ఐదుగురు, పది మంది చొప్పున ఉండేవారని, అందువల్ల వారు ఆ సమాజంలో భలంగా శక్తివంతులుగా ఉండేవారన్నారు. ఎవరైనా ఆ కుటుంభంపైకి వెళ్లాలంటే భయపడేవారని గుర్తు చేశారు. అంతేకాకుండా సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షకులుగా ఆ కుటుంభమే నిలిచేదన్నారు. పాత తరాల ఆచారాల పరిరక్షకులుగా భవిష్యత్ తరాలవారు పెద్ద కుటుంభాలుగా విస్తరించి దేశ జనాభాను పెంచాలని ఆయన సూచించారు. భారత్, ఛైనాల జనాభా పెరగడంతో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతున్న ఈ నేపధ్యంలో రష్యా అధ్యక్షుడి మాటలు కొత్త చర్చకు తెరలేపాయి.