దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి మొదటి స్థానమిచ్చినట్లు కేంద్రం చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించినట్లు వెల్లడించింది. రాజ్యసభలో ఎం.పీ. జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చింది. దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని ప్రశ్నించిన ఎం.పీ. ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమని ఆయనన్నారు. ఏపీ రాజధాని అమరావతి తో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని వివరించారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను కేంద్రం ఆమోదించిందని ఆయన అన్నారు.