ఏలూరు జిల్లా ఏలూరు సెక్షన్ రామసింగవరంలో సంచరిస్తున్న జంతువు పాదముద్రలను పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రధామ పెద్దపులి సమీప ప్రాంతంలో సంచరిస్తుందని ఒక ప్రకటన లో తెలిపారు. పెరుగుగూడెం గ్రామ సమీపంలో మొక్కజొన్న తోటలో శరీరంపై బంగారు మచ్చలు కలిగిన జంతువును ఈ నెల 26వ తేదీన కొంతమంది చూసి అటవీశాఖ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు జతువుల కాలి ముద్రలను పరిశీలించామని తెలిపారు.
పరిశీలించిన పిమ్మట అవి పెద్దపులి పాదముద్రలుగా ప్రాధమికంగా నిర్ధారించడమైనదన్నారు. పెద్దపులి వల్ల ఎటువంటీ ప్రమాదంలేనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఈ జంతువు సంచరిస్తుందన్న వార్త గ్రామ ప్రజలకు తెలియడంతో వారు భయభ్రాంతులకు గురికాకుండా అటవీశాఖ సిబ్బందిని టీమ్ లుగా విభజించి పెద్దపులి కదలికలను నిరంతరం గమనిస్తున్నామన్నారు.