కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని బాలుర వసతిగృహం-2 లో భారీ కొండచిలువ కలకలం రేపింది. మంచం కింద నక్కిన కొండచిలువలను అక్కడ ఉన్న విద్యార్థులు గుర్తించి వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం తెలిపారు.
ట్రిపుల్ ఐటీ అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి వేంపల్లి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. గది లో మంచం కింద దాగున్న ఆ కొండచిలువను ఫారెస్ట్ అధికారులు గోనె సంచిలో బందింఅడవిలో వదిలిపెట్టారు.