కాంగ్రెస్ ఆదాయపు పన్ను కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 105 కోట్లకు పైగా బకాయి పన్ను వసూలు కోసం కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, కాంగ్రెస్ స్టే అప్పీల్ను తిరస్కరిస్తూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఐ.టీ.ఏ.టీ. ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రాథమిక లోపం కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్లతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాజ్యంపై విచారణ జరిపి ఈ తీర్పును రిజర్వ్ చేసింది.