14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు అధ్యక్షతలో స్థానిక విక్టోరియా వాటర్ వర్క్స్ లోని స్మార్ట్ సిటీ సమావే మందిరంలో ఘనంగా జరిపారు. శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా కృతికాశుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ సతీశ్ కుమార్, తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఇందులో భాగంగా ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తదనంతరం దానికి సంబందించి తయారుచేసిన బ్రోచర్ ను ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు. సీహెచ్. నాగనరసింహారావు ఓటు హక్కు ఆవశ్యకత, వినియోగాన్ని తెలియపరుస్తూ ప్రతీ ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు.