కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, హూపర్ టిప్పర్ వాహన డ్రైవర్లు సమన్వయంతో అందించిన మెరుగైన సేవలే దేశవ్యాప్తంగా కాకినాడకు గుర్తింపును తెచ్చి పెట్టాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక డి- కన్వెన్షన్లో కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 225 మంది వాహన డ్రైవర్లు, పారిశుద్ధ్యకార్మికులు, నైట్ శానిటేషన్ వర్కర్లకు ఎమ్మెల్యే ద్వారంపూడి దుస్తులు పంపిణీ చేశారు .