పరీక్షలు సమీపిస్తున్న సమయంలో గిరిజన విద్యార్థులకు సానా సతీష్ బాబు మార్గదర్శనంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సాయం చేసింది. ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, పాండవుల పాలెం మరియు వొమ్మంగి గ్రామాలలో జిల్లా పరిషత్ మరియు గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు గిరిజన విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలకు పోటీ పడుతూ చదవాలని, అందరూ మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. తమ వంతుగా ఎగ్జామ్ ప్యాడ్స్ అందించి వారిని ప్రోత్సహిస్తున్నాము అన్నారు. సానా సతీష్ బాబు గారు, ఫౌండేషన్ చొరవ పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేశారు.