ఫెన్షనర్స్ ప్యారడైజ్ గా వున్న కాకినాడ ను ఓడరేవులు సముద్ర పర్యాటక రంగాల బలాన్ని ఉపయోగించుకుని ఆర్థికఅభివృద్ధి కేంద్రం గా మారుస్తామన్న స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఫలితాలు జీరో స్థాయిగా నిలిచి పోయాయని నగరపౌర సంక్షేమ సంఘం పేర్కొంది. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… వ్యర్థ జలాల శుద్ది కేంద్రాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేయడం అమానుషం అన్నారు.
నగరానికి అదనంగా లభించిన పౌరసౌకర్యాల ప్రయోజనం ఆదాయ వనరుల వృద్ది ఆస్తుల విలువ పెంచకుండా ఏడేళ్లకాలంలో రు.1,050కోట్లు వృధా చేసిన ఘనత స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు దక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిసర గ్రామాలతో గ్రేటర్ కాకినాడ గా అప్ గ్రేడ్ చర్యలు వహిస్తేనే కాకినాడ జిల్లా కేంద్రం ప్రగతి సాధిస్తుందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ కాకినాడ హామీ అంశాన్ని వారి మ్యానిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.