అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి. యం. అంబికా ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండు కేసులలో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 17 మందిని ముద్దాయిలుగా గుర్తించటమైందన్నారు. .
వారందరిని అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిచి, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ T. క్రాంతి కుమార్ బృందం ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.