డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన, తెలుగుదేశం ఆత్మీయ సమావేశంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయితా బత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం అభ్యర్థిగా తాను చేసిన సేవలను చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీ.జే.పీ. పార్టీ గుర్తించాయని చెప్పారు. పార్టీ అధికారంలో లేకపోయినా గత ఐదు సంవత్సరాలుగా తనకి జనసేన కార్యకర్తలు ఎంతో సహకారం అందించారని, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తనని ప్రకటించారని ఆనందం వ్యక్తం చేసారు. జనసేన, బీ.జే.పీ. కలిసిగట్టుగా తనను గెలిపించి జగన్ ప్రభుత్వాన్ని గద్ది దింపి, చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నుంచి నల్ల శ్రీధర్, ఇసుపట్ల రఘు బాబు, గంధం శ్రీను, చిక్కాల సతీష్, వీర మహిళలు, తెలుగుదేశం నుంచి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలి… -అయితా బత్తుల-
![WhatsApp Image 2024-03-30 at 8.59.48 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-30-at-8.59.48-AM.jpeg?resize=1080%2C596&ssl=1)