పదవ తరగతి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులు సబ్జెక్టు పట్ల ఆశక్తిని కనపరుస్తూ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చంటి పిల్లల వైద్య నిపుణులు డా. పి.ఎన్. రాజు అన్నారు. సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్దపడే అంశం పై క్లాస్ రూమ్ అవగాహనా సదస్సు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో డా. రాజు మాట్లాడుతూ… ప్రధానంగా విద్యార్థులు వారి మానసిక సామర్థ్యాన్ని బట్టి వారి పఠన సమయాన్ని నిర్ణయించు కోవాలన్నారు. అలాగే సబ్జెక్ట్లను బట్టి వాటిపై విద్యార్థులకున్న పట్టును బట్టి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మేధస్సు సహకరించని సమయంలో ఎంత చదివినా ఫలితం ఉండదని అలాంటి సమయంలో కొంత విశ్రాంతి తీసుకుని మరలా సిద్దపదాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జె.వి.వి. జిల్లా అధ్యక్షులు కె.ఎం.ఎన్. ఆర్. ప్రసాద్, హైస్కూల్ హెచ్.ఎం. యు. మీనా మాధురి, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.