జేపివి పాల సేకరణ లక్ష్యాలు 10 వేల లీటర్లు పెంచాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. కలెక్టరేట్ లో జగనన్న పాల వెల్లువ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ… జిల్లాలోని 4 మండలాలు పరిధిలో ఉన్న 35 గ్రామాల పరిధిలో 5400 లీటర్ల పాల సేకరణ చెయ్యడం జరుగుతోందని అన్నారు. ఆ లక్ష్యాలను 10 వేల లీటర్ల కు చేరాలని పేర్కొన్నారు. ప్రతీ గ్రామం లో 160 మంది సభ్యులతో కలిసి ఉంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రోత్సాహం ఆదించడం జరుగుతోందని ఆమేరకు పాడి రైతులకు అవగాహన పెంచి లక్ష్యాలను సాధించడానికి చొరవ తీసుకుని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మరిన్ని గ్రామాల్లో పాలసేకరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా పశు సంవర్ధక అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.