విజయవాడ బస్సు యాత్రలో సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి పై టి.డి.పి. పచ్చ గుండాల దాడిని అమలాపురంలోని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రంగా ఖండించారు. సీ.ఎం. పై దాడి సభ్య సమాజం తలవంచుకునే చర్యని మంత్రి అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచే కార్యక్రమంలో సిద్ధం సభ వెళుతుంటే టి.డి.పి. గూండాలు దాడి చేయడం అత్యంత హేయకరమైన చర్యగా తెలిపారు. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ గూండాలు రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. రాళ్ల దాడులు జగన్మోహన్ రెడ్డి మనోధర్యాన్ని దెబ్బతీయ లేవని ఆయన అన్నారు.