జమ్మూ రైల్వే స్టేషన్ లో హై అలర్ట్ ప్రకటించారని, ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా అన్ని భద్రతా చర్యలను సమీక్షించామని సంభందిత అధికారులు తెలిపారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈ నెలాఖరులో ప్రారంభం కానుందని, రైల్వే అధికారులు ముందస్తుగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ధారిస్తున్నారు.
ఈ సమావేశానికి రైల్వే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర సింగ్ నేతృత్వం వహించారు. భద్రతా సంస్థల ప్రతినిధులతో పాటు జమ్మూలోని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు కూడా ఉన్నారు. పాదయాత్రలో ఎలాంటి ప్రమాదం జరగకుండా జమ్మూ రైల్వే స్టేషన్లో భద్రతా బలగాలను పటిష్టం చేయడంపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు.