జీజీహెచ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, ఎం.పీ. వంగ గీతా విశ్వనాధ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖులు బయటకు రాగానే ఓ.పి. బ్లాక్ మెడికల్ వార్డు మధ్య లో భారీ చెట్టు అకస్మాత్ గా కూలిపోయింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, ఎం.పీ. వంగ గీతా విశ్వనాధ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ బయటకు రాకముందే చెట్టు కూలడంతో తృటిలో ప్రమాదం తప్పినట్టయింది. ఈ హాటాత్ పరిణామంతో రోగులు , వైద్యులు భయపడుతూ పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఒక కారు చిక్కుకు పోగా మరో మహిళ గాయపడింది. విపత్తు నివారణ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.