2000 నుండి ఒడిశాలో అధికారంలో ఉన్న బి.జె.డి. ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే నాటికి పార్టీ పాలన గడువు జూన్ 4తో ముగుస్తుందని అన్నారు. శాసనసభతో పాటు లోక్సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఒక రోజులో రెండు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… తదుపరి ముఖ్యమంత్రి బీ.జే.పీ. కి చెందిన వారని అన్నారు.
బీ.జే.పీ. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మా హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. బి.జె.డి. గడువు తేదీ జూన్ 4 ఎన్నికల ఫలితాలు ప్రకటించబడే రోజేనని అన్నారు. జూన్ 10న భువనేశ్వర్లో బీ.జే.పీ. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని మోదీ వెళ్లడించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానించేందుకు నేను ఇక్కడికి వచ్చానని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వస్థలమైన గంజాం జిల్లాలోని బెర్హంపూర్లో జరిగిన భారీ సభలో ఆయన ప్రసంగించారు.