కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి 89 వ జయంతి సందర్భంగా స్థానిక జవహర్ వీధిలోని వివేక్ భవన్ లో పౌర సంఘం ఆధ్వర్యాన పుష్పాంజలి నిర్వహించారు. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… కాకినాడ పురపాలక సభ్యులుగా, అధ్యక్షులుగా ప్రగతి సేవలందిం చిన జ్యోతుల సీతారామ మూర్తి సి.వి. కె. రావు, మల్లాడి స్వామి. కె.ఈ. ప్రభాజో సెఫ్ పేరిట ఆగస్టు 15న స్మారక స్టడీ సర్కిల్ ప్రారంభించారన్నారు.
1982 నుండి 1992 వరకు పురపాలకునిగా పదేళ్ల కాలంలో జ్యోతుల సీతారామమూర్తి నిర్వహించిన పౌర సేవలు మహానగర ప్రగతికి నిర్వర్తించిన పునాదులన్నారు. ప్రజాహితం మేరకు కార్పోరేషన్ నూతన భవనానికి జ్యోతుల నామకరణం నాలుగు రోడ్ల కూడలిలో సీతారామ మూర్తి విగ్రహం ఏర్పాటు ప్రక్రియను నూతన ప్రభుత్వం చేపట్టాలని కోరారు. వివేకా అభ్యుదయ సేవాసమితి అధ్యక్షుడు పెంకే నూకరాజు, చిరు వ్యాపారులు సంక్షేమ సంఘం కార్యదర్శి సరగడ రాంబాబు రెడ్డి పాల్గొన్నారు.