కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ లో పాత బస్ స్టాండ్ పరిధిలో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ ఎం.ఎల్. ఏ. వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన్ని తెలుగు దేశం పార్టీ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కొండబాబు, ఇంటిగ్రేటెడ్ అధికారులు, టీ. డీ.పీ. కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.