దేశ రాజధానిఅయిన ఢిల్లీలో అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చిన కొన్ని రోజుల తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్లోని అనేక పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్లు అందాయని పోలీసులు సోమవారం తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. దాదాపు ఆరు పాఠశాలలకు బాంబు పేలుడుతో బెదిరింపు ఇ-మెయిల్స్ అందుకున్నట్లు ధృవీకరించాయి. అయితే పాఠశాలలను తనిఖీ చేస్తున్నందున భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అహ్మదాబాద్ కంట్రోల్ డీ.సీ.పీ. తెలిపారు.