కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం బురదకోట పంచాయతీలో గల మారుమూల గ్రామమైన ఉలి గోగుల లో 35 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వారికి త్రాగునీరు లేక మురుగు కాలవల్లో నీళ్లు తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఎంతమంది ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారి గోడు తెలియజేసిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండల శాఖ దృష్టికి రావడంతో వెంటనే జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ కి తెలియజేయడం జరిగింది.
ఆయన వెంటనే స్పందించి మండలాధ్యక్షుడు కందా వీరస్వామి ఆధ్వర్యంలో ఉలి గోగుల గ్రామంలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్, జిల్లా కలెక్టర్ జై. నివాస్ గారిదృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ.జే.పీ. మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీ ఈర్ల దేవి, ప్రత్తిపాడు మండల జనరల్ సెక్రెటరీ ఇంటి వీర నాగేశ్వరరావు, జిల్లా సైనిక్ సెల్ కన్వీనర్ కరీధర్మరాజు పాల్గొన్నారు.