కాకినాడ జిల్లాలో వై.సీ.పీ. కి మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలాకు చెందిన జగ్గంపేట మండలం లో తెలుగు దేశం పార్టీలోకి గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ నుంచి పలువురు నాయకులు, యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయన ఇర్రి పాక శివాలయం వద్ద వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నూతంగా పార్టీలోకి చేరిన వారితో బైకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం, జనసేన పార్టీ విజయానికి అందురూ కృషచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.