రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయం ఎండమావిలా తయారైంది. అక్కడక్కడా ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్నట్టు వైషమ్యాలు మిన్నంటుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులతో ఇరుపార్టీల సమన్వయం రసాభసగా మారుతోంది. ఇటీవల పిఠాపురంలో ఇది భయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా జగ్గంపేటలో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో వీరి సక్యత ముందుకు సాగేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.